రైతు పేరు : చవ్వా సావిత్రమ్మ
గ్రామం  :హీరోజీపురం
మండలం  : లింగాల
జిల్లా   : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్

 

 

 

ప్రతాప్ రెడ్డి కొడుకు (శ్రీనివాస్ రెడ్డి) కిసాన్ మిత్ర టీం భాస్కర్, నరేష్ చారి

సమస్య : లింగాల మండలం, హీరోజీపురం గ్రామంలోని చవ్వా ప్రతాప్ రెడ్డి అనే రైతు తనకు ఉన్న 2.7 ఎకరాల భూమిలో అరటి, బొప్పాయి సాగు చేసి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. నీటి వసతి సరిగా లేదు అని బోరు వేయడం గురించి 5 లక్షల వరకు అప్పు చేయడం జరిగింది.

  • పంటకు సరైన సమయంలో నీటి వసతి అందకపోవడం వల్ల పంటలు ఎండిపోయి నష్టం వచ్చి దాదాపు 10 లక్షలు అప్పులు చేరడంతో తీవ్రంగా మనస్తాపం చెంది 10/09/2020 న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు మరియు రెవిన్యూ, అగ్రికల్చర్ అధికారులు వచ్చి కేసు నమోదు చేశారు.
  • ఈ రైతు  బార్య సావిత్రమ్మ (58), పిల్లలు,శ్రీనివాస్ రెడ్డి (48), శ్రీనివాస్ రెడ్డి భార్య లక్ష్మి రెడ్డి (38)లు, కూతురు శరణ్య (13) ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించి మా కుటుంబాన్ని ఆదుకోండి అని  రెవెన్యూ, అగ్రికల్చర్ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఏ అధికారి స్పందించకపోవడంతో, గ్రామస్తుల ద్వారా సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి తెలియడంతో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది.

కిసాన్ మిత్రా చేసిన పని :  సావిత్రమ్మ గారు సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర  హెల్ప్ లైన్ కి కాల్ చేయడంతో కిసాన్ మిత్ర టీం ముందుగా ఆత్మహత్య చేసుకున్న రైతు  ప్రతాప్ రెడ్డి భార్య అయిన సావిత్రమ్మ గారిని కలవటం, తన భర్త చనిపోవటానికి గల కారణాలు తెలుసుకొని, పూర్తి వివరాలు సేకరించటం జరిగింది. తరువాత  లింగాల అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలిసి ఈ రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఎక్సగ్రెసియా పెండింగ్ సమస్య గురించి  వివరించటం జరిగింది.

  • ఈ రైతు ఆత్మహత్య సమస్య గురించి మా దృష్టికి రాలేదు కాబట్టి గ్రామ రెవిన్యూ అధికారి నుండి గ్రామ ప్రాథమిక సమాచారం కావాలని చెప్పడంతో, మండల రెవెన్యూ అధికారి, గ్రామ రెవిన్యూ అధికారి గారిని కలిసి ఈ రైతు ఆత్మహత్య కుటుంబ సమస్యను తెలియజేయడం జరిగింది.
  • గ్రామస్తులను విచారించి వారం లోపల వి.అర్.ఓ మరియు ఆర్.ఐ గారు ఫీల్డ్ స్థాయిలో తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిని మండల  అధికారికి గారికి ఇవ్వగా ప్రైమరీ రిపోర్ట్ మరియు మండల 3 మేన్ కమిటీ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ పైన ఎస్.ఐ, యం.అర్.ఓ.గారితో సైన్ చేయించి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి మరియు కడప జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ లో రైతు ఆత్మహత్య విభాగంలో ఇవ్వడం జరిగింది.
  • తర్వాత డివిజన్ 3 మేన్ కమిటీ రిపోర్ట్ ప్రిపేర్ చేయించి ఫాలో అప్ చేయడం జరిగింది. ఈ కుటుంబానికి  అకౌంట్ లో 7 లక్షలు జమ కావడం జరిగింది.

రైతు భార్య సావిత్రమ్మ అబిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి ఫోన్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించటంలో కిసాన్ మిత్ర టీం పూర్తి సహాయ సహకారాలు అందించి ఎక్సగ్రెసియా వచ్చేలా కృషి చేశారు, ఆ డబ్బులతో కొంత అప్పు లు తీర్చుకొని కొంత మొత్తం పిల్లల పేరుతో డిపాజిట్ చేయడం జరిగింది.కిసాన్ మిత్ర లేకుంటే మాకు ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక పరిహారం వచ్చేది కాదు కాబట్టి సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.